
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణానికి చేరుకుని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకం తొలి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!