

తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి టీటీడీపై తీవ్ర విమర్శలు చేశారు. రెండున్నరేళ్లుగా టీటీడీకి “చంద్రగ్రహణం” పట్టిందని వ్యాఖ్యానించారు. టీటీడీ వైదిక, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం తగ్గిందని ఆరోపించారు. శతాబ్దాలుగా దేశం, రాష్ట్రం, ప్రజల సంక్షేమం కోసం టీటీడీ యాగాలు నిర్వహించేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా వరుణయాగం నిర్వహించాలనే ఆలోచన టీటీడీకి లేకపోవడం బాధాకరమన్నారు.
వేద సంస్కృతి, వేద పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను పక్కనపెట్టి ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని భూమన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. కొండపై జలాశయాలు ఎండిపోతున్న నేపథ్యంలో టీటీడీ వెంటనే వరుణయాగం నిర్వహించి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది విమర్శ కోసం చేస్తున్న వ్యాఖ్యలు కాదని, వైదిక సంప్రదాయాలు, యాగాల పరిరక్షణపై టీటీడీ దృష్టి సారించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!