

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై నిరసనగా జులై 14న తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని విద్యాసంస్థలు ఈ బంద్లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేయాలనే కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ పథకాలపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, కానీ రూ. 11,000 కోట్ల బకాయిల కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు తెలిపారు. ప్రతి ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్ అవుతున్నారని, 4.5 లక్షల మంది సర్టిఫికేట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!