
సినిమాలు

నీట్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న తెలంగాణలోని 24 నగరాల్లో 208 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 72,956 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. వదంతులు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశ్నపత్రాల రవాణాకు తొలిసారిగా భారత వైమానిక దళం సేవలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!