

నర్సింగ్ రంగంలో కొనసాగుతూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) అవకాశం కల్పిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 4న ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఈ నెల 15న సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉంది. ఇంటర్మీడియట్తో పాటు గుర్తింపు పొందిన సంస్థలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు అర్హులు. ఒకటిన్నర సంవత్సరాల ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు కారు.
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిని యూనివర్సిటీ విధించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2,000 కాగా, ఓసీ అభ్యర్థులకు రూ.2,500గా నిర్ణయించారు. యూనివర్సిటీ అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, నర్సింగ్కు సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని గడువులోగా దరఖాస్తు పూర్తి చేయాలని యూనివర్సిటీ సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!