

వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కంచెరువు, సిటీ వైన్స్ వాటర్లాగింగ్ ప్రాంతాలను, అలాగే మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ (COD) పైప్లైన్ పనులను సంబంధిత సివిక్ బాడీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్లాగింగ్కు దారితీస్తున్న కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీ సూచించారు. అలాగే సీఓడీ పైప్లైన్ పనులను వేగవంతం చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు సమాచారం ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!