
ఓటీటీ

ఈ నెల 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో భక్తులకు నిరాశ కలిగించే పరిణామం చోటుచేసుకుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే పవిత్ర మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. యాత్ర ప్రారంభం నాడు సుమారు ఐదు అడుగుల ఎత్తులో ఉన్న మంచు శివలింగం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరియు భారీ సంఖ్యలో భక్తుల రాక కారణంగా వేగంగా కరిగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజులపాటు కొనసాగనుంది. తొలి నాలుగు రోజుల్లోనే సుమారు 86 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, ఈ ఏడాది యాత్ర కోసం దాదాపు నాలుగు లక్షల మంది నమోదు చేసుకున్నారు. మంచు శివలింగం కరిగిపోయినా, గుహలోని పవిత్ర స్థలంలో యాత్రికుల దర్శనం యథావిధిగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!