
క్రీడలు

దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఇక కేరళ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నీటిమునిగిన రహదారులు, ట్రాఫిక్ అంతరాయాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!