

పశ్చిమాసియా ఘర్షణల సమయంలో ఇరాన్లోని మినాబ్ పట్టణంలోని ఓ పాఠశాలపై జరిగిన దాడి పాత నిఘా సమాచారంతో జరిగిన లక్ష్య నిర్ధారణలో జరిగిన తప్పిదం వల్లే జరిగి ఉండొచ్చని తాజా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన పాత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ లక్ష్యాలను నిర్దేశించిందని, ఆ సమాచారం కాలం చెల్లిందని నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ సీనియర్ కమాండర్లు దానిని పట్టించుకోలేదని ఆ కథనాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు సంబంధించిన లక్ష్యాలపై దాడులు జరుగుతున్న సమయంలో మినాబ్ పాఠశాల క్షిపణి దాడికి గురైనట్లు సమాచారం. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు మరణించారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పాఠశాల, ఐఆర్జీసీ స్థావరం ఒకప్పుడు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ, అనంతర కాలంలో వాటి మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పాఠశాలకు ప్రత్యేక ప్రవేశ మార్గం కల్పించినట్లు పేర్కొంది. ఘటనపై పెంటగాన్ ఇప్పటివరకు అధికారిక దర్యాప్తు నివేదిక విడుదల చేయకపోగా, దర్యాప్తు కొనసాగుతోందని వైట్హౌస్ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!