2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

Writer: Chandrika 09:58 AM, 2 సెప్టెంబర్, 2026
ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాలవారీగా ఈవీఎంలలో నమోదైన ఓట్లను ఒకేసారి కలిపి లెక్కించే ‘టోటలైజర్‌’ వ్యవస్థను ప్రస్తుత చట్టాల ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రజల్లో మరింత నమ్మకం కల్పించేందుకు టోటలైజర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ యోగేశ్‌ గుప్తా 2014లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈసీ తాజాగా తన వాదనలను సమర్పించింది. టోటలైజర్‌ విధానంలో ఒక నియోజకవర్గంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించిన ఈవీఎంల కంట్రోల్‌ యూనిట్లను అనుసంధానించి ఓట్లను సమష్టిగా లెక్కిస్తారు. అయితే దీనిని అమలు చేయాలంటే ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961’ను సవరించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. 2008 నుంచి ఈ అంశంపై ఈసీ, న్యాయశాఖ, పార్లమెంటరీ కమిటీ మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. 2016లో 21 రాజకీయ పార్టీలు, కేంద్ర మంత్రుల బృందం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయని వెల్లడించింది.

టోటలైజర్‌ అమలుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి సమగ్రంగా పరిశీలించినట్లు ఈసీ తెలిపింది. ప్రస్తుతం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో బూత్‌లవారీగా ఓట్లను లెక్కించి, పోలింగ్‌ ముగిసే సమయంలో నమోదు చేసే ఫాం-17సీతో వాటిని సరిపోల్చే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే అభ్యర్థులకు వీవీప్యాట్‌ స్లిప్పుల పరిశీలన, రీకౌంటింగ్‌ కోరే హక్కు కూడా ఉందని వివరించింది. టోటలైజర్‌ ద్వారా సమష్టిగా ఓట్లను లెక్కిస్తే బూత్‌లవారీ ఓట్లను పోల్చుకునే అవకాశం తగ్గి పారదర్శకతపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. 2019లో నారా చంద్రబాబునాయుడు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో, అలాగే ఏడీఆర్‌ వర్సెస్‌ ఈసీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వీవీప్యాట్‌ ధ్రువీకరణకు సంబంధించిన ఆదేశాలను కూడా ఈసీ ప్రస్తావించింది. టోటలైజర్‌ విధానం అమల్లోకి వస్తే ఈ నిబంధనలను అమలు చేయడం కష్టమవుతుందని పేర్కొంది. ఇప్పటికే ఈవీఎంలపై వివిధ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చట్టపరమైన మార్పులు లేకుండా టోటలైజర్‌ను ప్రవేశపెడితే కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. టోటలైజర్‌ వ్యవస్థను అమలు చేయాలంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం, ఎన్నికల నిబంధనల్లో సవరణలు, పార్లమెంటు ఆమోదం అవసరమని ఈసీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

ట్యాగ్లు
ఎన్నికల సంఘంఈవీఎంలుఈవీఎం టోటలైజర్‌సుప్రీంకోర్టువీవీప్యాట్‌ఓట్ల లెక్కింపుఎన్నికల నిబంధనలుఎన్నికల పారదర్శకతభారత ఎన్నికలుఎన్నికల సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
బిజినెస్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!