
జనరల్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమై కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు కోల్పోయి 76,262 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 23,823 వద్ద కదలాడుతోంది.
నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్ఫార్మా, ఓఎన్జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు, చమురు ధరల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!