

విజయం అంటే పెద్ద ఇల్లు, డబ్బు లేదా గుర్తింపు పొందడం కాదని, సమాజంలో గౌరవం సంపాదించడమే నిజమైన విజయమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలోని గీతం వైద్య విజ్ఞాన సంస్థ 17వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. సుమారు 4 వేల మంది విద్యార్థులకు వైద్య విద్య పట్టాలు, పతకాలను అందజేశారు. పట్టభద్రులైన విద్యార్థులు వైద్యులుగా అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. డబ్బు కేవలం సౌకర్యాలను కల్పిస్తుందని, గౌరవాన్ని మాత్రం సంపాదించి పెట్టదని అన్నారు. మనం చేసే పనికి సమాజంలో లభించే గౌరవమే అసలైన విజయానికి కొలమానమని పేర్కొన్నారు. మన వ్యక్తిత్వం గురించి ఇతరులకు ముందుగా తెలుస్తుందని, అందుకే నిజాయితీగా, ఆదర్శంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి బాలసుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ కోర్సులో అట్లూరి సాయిప్రసిద్ధకు ఓవరాల్ గోల్డ్ మెడల్, ఉత్తమ పరిశోధనకు డాక్టర్ జానా గోల్డ్ మెడల్ అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!