
గాసిప్స్

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా నిలిచిన సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50 సంవత్సరాలు దాటిన పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చే పనులకు ఈ నెల 13న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు బ్యారేజీ భద్రతను మెరుగుపరచేందుకు రూ.152.95 కోట్ల వ్యయంతో ఈ పనులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా 117 ఫ్లడ్ గేట్లను పూర్తిగా మార్చడంతో పాటు, 12 హెడ్ స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు, 175 క్రెస్ట్ గేట్లకు రబ్బరు సీల్స్, 734 రోలర్ బేరింగ్స్ అమర్చనున్నారు. బీఈసీఓఎమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయనుంది. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, పోలవరం ప్రాజెక్ట్ పనులను కూడా సమీక్షించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!