

వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాదేశిక విస్తరణ యత్నాలను అమెరికా, బ్రిటన్తో పాటు మరో 12 దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ చర్యలు అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, ప్రాంతీయ స్థిరత్వానికి భంగం కలిగిస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. చైనా ప్రవర్తన శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
2016 జూలై 12న ద హేగ్లోని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ఈ దేశాలు గుర్తు చేశాయి. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్ట ఒప్పందం ప్రకారం, చైనా గుర్తించిన సరిహద్దులకు వెలుపల ఉన్న వనరులపై హక్కులు లేవని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని కూడా తప్పుపట్టింది. అయితే చైనా ఈ తీర్పును తిరస్కరిస్తూ, దక్షిణ చైనా సముద్రంపై తమ హక్కులు కొనసాగుతాయని పునరుద్ఘాటించింది. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ 27 దేశాలు ఈ తీర్పును చారిత్రాత్మకంగా పేర్కొంటూ, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!