

వారణాసి నగరానికి భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్ రానుంది. ప్రతిపాదిత రూ.3,184 కోట్ల గంగా కారిడార్ ప్రాజెక్ట్ ద్వారా నగర అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి-19, వలయ రహదారి (రింగ్ రోడ్), గంగా నదీ తీరాన్ని అనుసంధానించే 20 కిలోమీటర్ల లింక్ కారిడార్ను నిర్మించనున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కీలక ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది.
గత దశాబ్దంలో కాశీ విశ్వనాథ్ కారిడార్, వలయ రహదారులు, జాతీయ రహదారుల విస్తరణ, గంగా ఘాట్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులతో వారణాసి వేగంగా మార్పు చెందింది. తాజా గంగా కారిడార్ ప్రాజెక్ట్ ఈ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. పర్యాటకం, వ్యాపారం, నగర రవాణా వ్యవస్థలకు ఇది మేలు చేయడంతో పాటు వారణాసిని ఆధునిక ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!