3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

Writer: Shivani K 10:57 PM, 2 ఆగస్టు, 2026
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసాలలో ఒకటైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ఇటీవల ఆడ పులి అనుమానాస్పద మృతి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి, క్షేత్రస్థాయిలో సమీక్ష అవసరాన్ని గుర్తించారు. పులులు, వాటి ఆవాసాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశించారు.

రాష్ట్ర అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్ పాండే, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యుడు బి. రాజశేఖర్, టైగర్ సంరక్షణ సంఘం ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ, వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నవీన్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పులుల జనాభా, ఆవాసాలకు ఉన్న ముప్పులను అంచనా వేయడం, నివారణ వ్యూహాలు రూపొందించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సిబ్బంది సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్ర సిఫారసులు ఇవ్వాలని సూచించారు. పులుల సంరక్షణ, జీవవైవిధ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక సందేశం

యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక సందేశం

ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్

ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్

సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై తెలంగాణ కీలక సమీక్ష

సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై తెలంగాణ కీలక సమీక్ష

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్పులుల సంరక్షణహైపవర్డ్ కమిటీనాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్వన్యప్రాణులుఅటవీశాఖజీవవైవిధ్యంపర్యావరణ పరిరక్షణప్రభుత్వ నిర్ణయంసంరక్షణ చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెజార్టీ హామీ ఇస్తేనే పోటీ: కోమటిరెడ్డి
రాజకీయాలు

మెజార్టీ హామీ ఇస్తేనే పోటీ: కోమటిరెడ్డి

యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక సందేశం
జనరల్

యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక సందేశం

ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్
జనరల్

ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్

సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై తెలంగాణ కీలక సమీక్ష
జనరల్

సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై తెలంగాణ కీలక సమీక్ష

‘ఫౌజీ’పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

‘ఫౌజీ’పై పెరుగుతున్న అంచనాలు

కెరీర్ ప్రారంభ కష్టాలను గుర్తుచేసుకున్న విజయ్ వర్మ
సినిమాలు

కెరీర్ ప్రారంభ కష్టాలను గుర్తుచేసుకున్న విజయ్ వర్మ

బాలీవుడ్ మార్పులపై సంజయ్ దత్ వ్యాఖ్యలు
సినిమాలు

బాలీవుడ్ మార్పులపై సంజయ్ దత్ వ్యాఖ్యలు

‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం
జనరల్

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు
జనరల్

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక
క్రీడలు

దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది
క్రీడలు

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!