

దులీప్ ట్రోఫీ కోసం దక్షిణ మండల జట్టును ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే 2026–27 సీజన్ టోర్నీకి సంబంధించిన ఈ సమావేశాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు కన్వీనర్గా వ్యవహరించగా, మాజీ రంజీ క్రికెటర్ ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, గోవా, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ 15 మంది సభ్యులతో దక్షిణ మండల జట్టును ఎంపిక చేసింది. హైదరాబాద్కు చెందిన భారత ఆటగాడు తిలక్ వర్మను కెప్టెన్గా నియమించగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన రికీ బుయినును వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అనుభవజ్ఞుడైన కోచ్ ఎం.ఎన్. విక్రమ్ వర్మను ప్రధాన కోచ్గా నియమించారు. సమతూకమైన జట్టుతో మెరుగైన ప్రదర్శన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!