

నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన కేసులను సీబీఐ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 158 కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికీ, అవి వివిధ కోర్టుల్లో విచారణ దశలోనే నిలిచిపోయాయి. వీటిలో కొన్ని కేసులు 20 సంవత్సరాల కంటే పాతవిగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని అన్ని హైకోర్టులను ఆశ్రయించాలని సీబీఐ నిర్ణయించినట్లు సమాచారం.
నీట్ పేపర్ లీక్ ఘటనల తరువాత పరీక్షల్లో పారదర్శకతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేసి, కేసుల విచారణను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని నిబంధనలు రూపొందించింది. అనేక రాష్ట్రాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ల నియామకం సహా అన్ని వనరులు అందుబాటులో ఉంచుతామని సీబీఐ హైకోర్టులకు తెలియజేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!