
బిజినెస్

హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద బంజారాహిల్స్లోని ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్ వద్ద కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో సిగ్నల్రహిత ప్రయాణానికి మార్గం సుగమం కానుంది.
ఈ నిర్మాణ పనులను రూ.368 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్లో రూ.147 కోట్లతో రెండు లేన్ల వన్వే స్టీల్ ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్లో రూ.221 కోట్లతో మూడు లేన్ల వన్వే స్టీల్ ఫ్లైఓవర్తో పాటు రెండు లేన్ల వన్వే అండర్పాస్ నిర్మించనున్నారు. కాంక్రీట్కు బదులుగా స్టీల్ స్ట్రక్చర్ విధానంలో నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!