

దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) ప్రతిపాదిత ఐపీఓపై స్టాక్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో జరగనుంది. అంటే ఎన్ఎస్ఈలోని ప్రస్తుత ప్రధాన వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లలో కొంత భాగాన్ని విక్రయిస్తారు. ఐపీఓ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుండగా, ధరల శ్రేణిని రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించినట్లు సమాచారం.
ఐపీఓ డీఆర్హెచ్పీలో పేర్కొన్న వివరాల ప్రకారం, పలు సంస్థలు గతంలో ఎన్ఎస్ఈ షేర్లను అత్యంత తక్కువ సగటు ధరలకు కొనుగోలు చేశాయి. గరిష్ఠ ఇష్యూ ధర రూ.1,785గా ఉంటే, న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థలకు సుమారు 5,57,712% లాభం వచ్చే అవకాశం ఉంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 3,87,950%, యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కు 3,56,900%, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 3,30,450%, ఎస్బీఐకి 2,23,025%, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 33,835%, అరందా ఇన్వెస్ట్మెంట్స్కు 2,760%, ఎంఎస్ స్ట్రాటజిక్కు 2,580%, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకు 450% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఇవి పేర్కొన్న కొనుగోలు ధరలు, గరిష్ఠ ఐపీఓ ధర ఆధారంగా అంచనా వేసిన రాబడులు మాత్రమే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!