

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో భారత వైమానిక దళ అవసరాలకు 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్, కార్గో టెర్మినల్, ఎంఆర్ఓ, భవిష్యత్ విస్తరణల కోసం 400 ఎకరాలు కేటాయించనున్నారు.
ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్ ద్వారా ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, కార్గో రవాణా, రక్షణ రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భూసేకరణ, రహదారుల మార్పు, విద్యుత్ లైన్ల తరలింపు, ఇతర మౌలిక వసతుల పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!