
జనరల్

ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో పోలీసులు, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మగ్లర్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ గోవును చెట్టుకు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు రావడాన్ని గమనించిన తస్లీమ్, భూరా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో తస్లీమ్, భూరా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. తస్లీమ్పై 15 కేసులు, భూరాపై 10 కేసులు నమోదైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!