

అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. జూన్లో కుదిరిన ఒప్పందం గడువు ముగియడం, ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, దీనికి ప్రతిగా ఇరాన్ నుంచి హెచ్చరికలు రావడంతో పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని, ఉదయం స్వల్ప లాభాల్లో కనిపించిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
సెన్సెక్స్ 77,629.56 వద్ద లాభాల్లో ప్రారంభమైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,201.66 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 171.72 పాయింట్లు నష్టపోయి 77,369.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.95 పాయింట్లు తగ్గి 24,219.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో అదానీ పోర్ట్స్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ షేర్లు నష్టపోగా.. టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ఫార్మా లాభాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.74గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 92.73 డాలర్లుగా, బంగారం ఔన్సు ధర 4,646 డాలర్లుగా నమోదైంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!