
రాజకీయాలు

లోతుకుంటలోని ఆర్మీ భూముల్లో హైడ్రా అధికారుల జోక్యంపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రక్షణ శాఖకు చెందిన భూముల్లో అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే, వారు హైడ్రా అధికారులు అయినా, పోలీసులు అయినా వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు కోర్టు సూచించింది. రక్షణ శాఖ భూముల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రెండు రోజుల క్రితమే ఇదే అంశంపై అధికారులను హెచ్చరించినప్పటికీ మళ్లీ ఆ భూముల జోలికి వెళ్లే పరిస్థితులు తలెత్తితే వెంటనే కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆర్మీకి ఆదేశించింది. రక్షణ శాఖ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!