
జనరల్

హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు 60 పైసలు విధిస్తూ కొత్త సెస్ను అమల్లోకి తీసుకొచ్చింది. అనాథల సంక్షేమం కోసం ఈ సెస్ను విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త సెస్ ఆగస్టు 11 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని వితంతువులు, అనాథ పిల్లల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
పెట్రోల్, డీజిల్ మొదటి విక్రయ దశలోనే ఈ సెస్ను వసూలు చేస్తారు. ఇటీవల ఆమోదించిన చట్ట సవరణతో ప్రభుత్వం గరిష్ఠంగా లీటర్కు రూ.5 వరకు సెస్ విధించే అధికారం పొందింది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం లీటర్కు 60 పైసలకే పరిమితం చేసింది. ఈ నిర్ణయం ద్వారా అనాథలు, వితంతువుల సంక్షేమానికి నిధులు సమకూరనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!