
జనరల్

అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ సీఈవో (సీఈవో) పోస్టుకు భారీ స్పందన లభించింది. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి 5 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక పదవికి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు, అలాగే మాజీ సైనిక అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ట్రస్ట్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాల ఆధారంగా సీఈవోను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అధికారి ట్రస్ట్ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!