

కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో నిర్వహించిన "చలో పార్లమెంట్" ప్రదర్శనపై పోలీసుల చర్యలను నిరసిస్తూ తన నిరసన దీక్షను కొనసాగిస్తానని సోనం వాంగ్చుక్ స్పష్టం చేశారు. ఎంపీలను పార్లమెంట్లో కలిసేందుకు పార్టీ యువ నాయకులకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఆస్పత్రిలో తనను కలిసే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనను అడ్డుకుని యువకులను అదుపులోకి తీసుకున్న తీరు తనను తీవ్రంగా కలచివేసిందని, తన భార్య గీతాంజలి ఎక్స్లో పోస్టు చేసిన చేతిరాత ప్రకటనలో పేర్కొన్నారు.
అంతకుముందు చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాత్కాలికంగా డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్కు వాంగ్చుక్ లేఖ రాశారు. ఇదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రెంకల్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్ల జాబితాను అందజేశారు. వాంగ్చుక్కు అందుతున్న వైద్యంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!