
సినిమాలు

అస్సాంలోని జోర్హాట్లో భారత వాయుసేనకు చెందిన AN-32 విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలోనే ఈ విమానం కూలినట్లు ప్రాథమిక సమాచారం. నేలపై పడిన వెంటనే భారీ మంటలు చెలరేగడంతో ప్రమాద స్థలం మొత్తం పొగతో కమ్ముకుపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు, విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితిపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!