
జనరల్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల గుర్తింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి పోలీసులు అక్కడ పాల్గొన్న వ్యక్తుల వివరాలను సేకరించినట్లు సమాచారం.
గుర్తించిన 2,873 మందిలో 989 మందిపై హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు వీరిలో ఎవరైనా ప్రయత్నించారా? లేదా ఇతర ఉద్దేశాలతో వచ్చారా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!