
జనరల్

భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ఎస్-400 ట్రయంఫ్ వైమానిక రక్షణ వ్యవస్థల కొనుగోలుపై దృష్టి పెట్టింది. మరో ఐదు ఎస్-400 స్క్వాడ్రన్ల కోసం భారత్ టెండర్ జారీ చేయగా, దీనికి స్పందనగా రష్యా తన ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం.
భారత వైమానిక రక్షణ వ్యవస్థలో ఎస్-400కు కీలక స్థానం ఉంది. దేశంలో దీనిని ‘సుదర్శన్’గా పిలుస్తారు. వివిధ రకాల వైమానిక ముప్పులను గుర్తించి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు వైమానిక ముప్పులను అడ్డుకోవడంలో ఎస్-400 కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో భారత రక్షణ వ్యవస్థలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!