
జనరల్

దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం హర్యానాను ఎంపిక చేయగా, దేశంలో పర్యావరణహిత రవాణాకు ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు కాలుష్య వాయువులు విడుదల చేయకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇందులో 682 సీట్లు ఉండగా, మొత్తం 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. భారత్ నెట్ జీరో కార్బన్ లక్ష్య సాధనలో ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!