
రాజకీయాలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని ₹1,400 కోట్లను అమరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. ఆ నిధులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయా అంటూ ప్రశ్నించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తమపై భయం లేదని చెప్పుకుంటూనే ఈసీకి వెయ్యికి పైగా ఫిర్యాదులు ఇచ్చారని, తనకు టీఆర్ఎస్ పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్లో నీతి నియమాలు లేవని, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని విమర్శించారు. తాను మళ్లీ ఆ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, భాజపా కలిసి తన పోరాటాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీశ్రావు తదితరులపై అవినీతి ఆరోపణలు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!