
జనరల్

ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్న నిర్మాణాలపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించింది. బాధ్యులైన అధికారులను వదిలేయడం సరైంది కాదని స్పష్టం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
గురుగ్రామ్లో ఫైర్ సేఫ్టీ లోపాలకు సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, భవనాల తనిఖీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన ధర్మాసనం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!