
సినిమాలు

శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి అనుకోని ఘటన ఎదురైంది. ల్యాండింగ్ ప్రక్రియలో విమానం ఓ స్తంభాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో విమానాశ్రయంలో అప్రమత్తత నెలకొంది. వెంటనే భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు, విమానం పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
అయితే ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. విమానానికి ఎంతమేర నష్టం వాటిల్లింది, ఘటనకు అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు, ఇండిగో నుంచి మరింత సమాచారం రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!