
క్రీడలు

సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్తగా వ్యవహరించడం ఒక కొత్త వ్యాపారంలా మారుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు నిర్మాణ పనిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని దాడి చేసిన కేసులో ఆర్టీఐ కార్యకర్తకు, అతని అనుచరులకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న పనుల పర్యవేక్షణ ప్రభుత్వ అధికారుల బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది.
ఆర్టీఐ పేరుతో సంచలనాలు సృష్టించాలనుకుంటున్నారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతిని ప్రశ్నించినందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!