

ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మరింత తీవ్రతరం కానుంది. రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇన్-సర్వీస్ వైద్యులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ వైద్యులను సేవల్లో వినియోగించుకోవాలని ఆదేశించింది.
అత్యవసర సేవలపై ప్రభావం పడకుండా సెకండరీ ఆస్పత్రుల నుంచి కూడా వైద్యులను అవసరమైన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ విభాగాల్లో సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు చేపడుతోంది. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!