

విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 18 వరకు గడువు ఉండగా, మూడేళ్ల కాంట్రాక్టు ఆధారంగా నియామకం జరగనుంది. అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీతో పాటు 20 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. పరిపాలన, ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ, భద్రత, న్యాయ వ్యవహారాల్లో అనుభవం ఉండాలి. హిందువై ఉండటం తప్పనిసరి కాగా, శ్రీరాముడి భక్తులకు ప్రాధాన్యం ఇస్తారు.
ఇదే సమయంలో విరాళాల చోరీ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. సిట్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!