

గోదావరి-బనకచర్ల, గోదావరి-నల్లమలసాగర్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. భారాస మొదటి నుంచే ఈ అంశాలపై హెచ్చరిస్తోందని, తమ ఒత్తిడితోనే ప్రభుత్వం పాత తేదీలతో లేఖలు రాసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యాజ్యం దాఖలు చేయలేదని గమనించిందని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ త్వరలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. సింగూర్ నీటి సమస్యలు, శాబాద్ ఘటన వంటి అంశాలను ప్రస్తావిస్తూ పరిపాలనలో లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!