
జనరల్

రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఆయుష్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ ఆసుపత్రులు యునాని వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి తెలిపారు.
ఈ సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొంటూ, ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. అలాగే వైద్యులు, బోధనా సిబ్బంది, ఇతర ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!