

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి మూడేళ్లు పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నల్లగొండలో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రెండేళ్లలో తెలంగాణలోని ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానించేలా డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. హడ్కో రుణంతో హామ్ రోడ్ల పనులు చేపడుతున్నామని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకమని మంత్రి అన్నారు. రూ.12,073 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. జనవరిలో పనులు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పాదయాత్ర చేపడితే తాను కూడా పాదయాత్ర చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!