24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

Writer: Chandrika 09:49 AM, 24 ఆగస్టు, 2026
కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో నేడు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, రెండు రాష్ట్రాల తాగునీరు, ఇతర అవసరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

కృష్ణా జలాలను బేసిన్ ప్రాతిపదికన 71:29 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో ఏపీకి వాటా లేదని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా బేసిన్‌లో నీటిని నిల్వ చేసుకునే సదుపాయం పరిమితంగా ఉన్నందున ఉమ్మడి జలాశయాల్లో నీటిని తాగునీటి అవసరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ ప్రజల తాగునీటి అవసరాలకు 50 టీఎంసీలు అవసరమని తెలంగాణ అంచనా వేసింది. ఇందులో శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 40 టీఎంసీలు అవసరమని తెలిపింది.

మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య 70:30 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 47 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. తమకు లభించే 115.70 టీఎంసీల వాటా నుంచి 47 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు కేఆర్ఎంబీ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

ట్యాగ్లు
కేఆర్ఎంబీకృష్ణా నదికృష్ణా జలాల వివాదంతెలంగాణఆంధ్రప్రదేశ్శ్రీశైలం జలాశయంనాగార్జునసాగర్నీటి పంపకాలుతాగునీరుతెలంగాణ ఏపీ జల వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
రాజకీయాలు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు
జనరల్

తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..
జనరల్

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?
సినిమాలు

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?
జనరల్

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?
గాసిప్స్

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?
జనరల్

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...
జనరల్

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్
జనరల్

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!