
సినిమాలు

తెలంగాణలో ఈ నెల 15 నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. బ్రాండ్ కేటగిరీ ఆధారంగా ధరలు పెరగనున్నట్లు సమాచారం. రెగ్యులర్ బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై సుమారు రూ.80 వరకు, ప్రీమియం బ్రాండ్లపై రూ.90 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. కాస్ట్లీ, సూపర్ ప్రీమియం బ్రాండ్లపై రూ.120 వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా.
బీర్ల ధరలను పెంచాలని కంపెనీలు కోరినప్పటికీ, గత ఫిబ్రవరిలోనే ధరలు పెరగడంతో ఈసారి వాటిని యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ప్రకారం జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!