

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే వ్యవసాయ పరపతి సహకార సంఘాల (PACS) డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధివిధానాలను రూపొందించారు.
ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు. 60 శాతం నామినేటెడ్ పోస్టులను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని సంప్రదింపుల అనంతరం తుది జాబితాను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కలిసి ఖరారు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!