

సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా వ్యాపారం జరగనుంది. రాఖీల విక్రయాలే దాదాపు రూ.25 వేల కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, బహుమతులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను కలిపితే మొత్తం పండుగ వ్యాపారం రూ.30 వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలోనే సుమారు రూ.4 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ పేర్కొంది. గత రెండు, మూడేళ్లుగా చైనా రాఖీల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, వినియోగదారులు దేశీయంగా తయారైన రాఖీలు, స్వదేశీ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ముఖ్యంగా యువత థీమ్ ఆధారిత రాఖీలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!