
క్రీడలు

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే E20 పెట్రోల్ విక్రయాలను ఐదు రోజుల్లో నిషేధిస్తామని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 2027 మార్చి 10 తర్వాత గోవాలో తమ ప్రభుత్వం ఏర్పడితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను ఐదు రోజుల్లో నిలిపివేస్తామని చెప్పారు. ఈ హామీని అమలు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ ప్రకటించారు.
E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అలాగే E20 కారణంగానే చక్కెర ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. E20పై ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!