

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జేఈఈ, నీట్ వంటి కీలక పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న 47 మంది అధికారులను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది.
తొలగించిన అధికారుల్లో కొందరిపై అవసరమైతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని పేర్కొంది. జూలై 22న లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్టీఏలో మంజూరైన 39 శాశ్వత పోస్టుల్లో ప్రస్తుతం 24 మంది మాత్రమే పనిచేస్తుండగా, 73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 124 మంది ఔట్సోర్స్ సిబ్బంది కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!