
జనరల్

పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం ముసుగులో సంఘవిద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పార్లమెంట్పై దాడి చేయాలనే కుట్ర కూడా జరిగినట్లు పేర్కొన్నారు. అరాచకాలకు పాల్పడిన వారిపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారని స్పష్టం చేశారు.
విపక్షాలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్లు జరిగాయని, అప్పుడు ఎవరూ రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో జేఈఈ తరహాలోనే నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. 2014 తర్వాత దేశంలో ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఆయన వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!