
రాజకీయాలు

2026 తొలి అర్ధభాగంలో భారత లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం మెర్సిడెస్-బెంజ్ ఇండియా 9,768 కార్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలవగా, బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా 9,075 యూనిట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు ఆడీ ఇండియా 2,182 యూనిట్ల విక్రయాలతో వెనుకబడింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3,039 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచి ఆడీని అధిగమించింది. విభిన్న మోడళ్ల శ్రేణి, బ్రాండ్ విలువ, పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసం కారణంగా మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ భారత లగ్జరీ కార్ల విభాగంలో తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!