

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో ధాన్యం బస్తాలు మునిగిపోగా, ఆరబెట్టిన ధాన్యం కూడా కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!