
జనరల్

విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్థాగత బలోపేతం దిశగా కీలక చర్యలు ప్రారంభించింది. జనరల్ మేనేజర్ స్థాయి సీనియర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేయడంతో పాటు, యూపీఎస్సీ ప్రాతిభా సేతు పోర్టల్ ద్వారా 16 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది.
ప్రొఫెసర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని హై లెవల్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణలో ఇది తొలి కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సంస్థ పరిపాలన, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం, నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!